Current Affairs

Kadapa Sri Vijaya Durga Devi Temple History – Temples in Kadapa

Sri Vijayadurga Devi Temple:  This temple town on the west side of the East biltap near Kadapa, Kurnool – Chittoor national highway construction.

   రదృతువులో మేఘాలు వర్షించి జగత్తుకు కలిగిన తాపాన్ని తొలగిస్తున్నాయి . అదే విధంగా శరదృతువులో ప్రారంభమయ్యే అమ్మవారి శరన్నవరాత్రుల పూజా ఫలితాలు మనుషుల్లో ఉన్న అజ్ఞాన తాపాన్ని తొలగిస్తున్నాయి . ఈ ఋతువులో తానూ ప్రకృతి రూపంతో ఎంత పచ్చగా వికసిస్తుందో అలాగే మనుషుల్లో జ్ఞానరూపమై సంప్రధూపమై నిలుస్తుంది ఆ జగన్మాత.

                మ్మలగన్న అమ్మ ముమ్మూర్తులకు ఆది దేవత . అన్ని లోకాలకు పాలించే జగన్మాత, శ్రీ విజయ దుర్గాదేవిగా కడప పట్టణంలో వెలసింది. ఏనాటి పుణ్యమో ఎన్ని జన్మల సుకృతమో ఈ తల్లి మన నగర వాకిట నిలిచి మనందరి అరచేతి మాణిక్యంగా అలరారుతుంది .  పట్టణానికి పడమటి దిక్కున తూర్పుముఖంగా కుదిరిన యోగ్యమైన పవిత్ర స్థలంలో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి ప్రక్కన అమ్మవారు కొలువుదీరింది.

                 శిల్పకళ , వాస్తు, ఆగమ శాస్త్రజ్ఞులు సాంకేతిక నిపుణులు ఎందరో పండితుల సలహాలను, సూచనలను పాటించి ఏంతో మంది కార్మికులతో అహర్నిశలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించినవారు ” శ్రీ దుర్గా ఆటో మోటివ్స్ ” అధినేత శ్రీ సుధా మల్లికార్జున రావు గారు,. వీరు తన సమయ , వ్యయ , ప్రయాసలను వెచ్చించి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంలా మలిచారు.

                                                 

                 మ్మ అనుగ్రహం అందరికీ కావాలి ! అమ్మ దయ ఉంటె చాలు అన్ని సమకూరుతాయి ! ఆ అమ్మ ప్రేమ కోసం మనమంతా ఆరాటపడాలి ! అందరిలో భక్తి భావం పెంపొందాలి అంటారు ఆలయ వ్యవస్థాపకులు . ఈ వినమ్రత, ఈ ఔదార్యమే వారిని సామాన్య మానవ జీవన స్థితి నుంచి మహా మనిషి గా తీర్చిదిద్దింది . నేను కాదు కర్తను మనందరికీ అమ్మవారి కరుణయే కారణం , ఇదంతా అమ్మ ఆశీర్వాద భలం , జరిగే కార్యక్రమాన్ని అమ్మ సంకల్ప రూపాలే అంటారు శ్రీ సుధా మల్లికార్జున రావు గారు.

                 పురాతన ఆలయ నిర్మాణ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరిగింది . రండి ! రారండి ! అమ్మను దర్శించి తరించండి అని ఆహ్వానిస్తున్నట్లుగా సుందరమైన సింహద్వారం స్వాగతం పలుకుతుంది . యాత్రికులకు , బాటసారులకు  బహుదూరం నుంచి గమనించినా అమ్మవారి నివాసం ఇదే ! అని సూచించే విధంగా 46 అడుగుల ఎత్తేన ధ్వజ స్తంభం కనబడుతుంది.  అమ్మవారికి ఎదురుగా ఆమెకు ఏంటో ప్రీతి అయినట్టి వాహనం మృగరాజును ప్రతిష్టించారు. ఎల్లయ్య మండపంలో పరమ పవిత్రమైన శ్రీ చక్రమేరువును ప్రతిష్టించారు . సహజంగా ఆ అన్ని చోట్ల భక్తుల గోత్రనామాలతో అర్చకులు శ్రీ చక్రార్చన చేస్తారు. కానీ ఈ విజయ దుర్గా దేవి ఆలయంలో భక్తుల చేత స్వయంగా శ్రీ చక్రార్చన చేయిస్తారు. ” మూలమంత్రాత్మికా ములకుటత్రయ కళేబరా ” సరస్వతి, లక్ష్మి , పార్వతి అనే ముగ్గురు శక్తులతో కూడినది శ్రీ చక్రం. శ్రీ చక్రాన్ని పూజించిన వారికి సర్వస్వతి విద్యను, లక్ష్మి సంపదను, పార్వతి శక్తిని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని  లలితా సహస్రనామాలలో చెప్పబడింది .

            ఇక ముఖ్యమైనది  అమ్మవారి విగ్రహం. ఆలయ మండపం నుంచి కొంచెం ముందుకు వెళితే చతుర్విధ ఫలపురుషార్థాలను ప్రసాదించే ఆ తల్లి శ్రీ విజయదుర్గా దేవి సరిగ్గా నాల్గవ వాకిట దర్శనమిస్తుంది . READ MORE


  • READ SRI VIJAYA DURGA TEMPLE HISTORY IN TELUGU CLICK HERE

Mother sought to fulfill desires temples built in the middle of nowhere in a manner that is unprecedented in the Rayalaseema region, sprinkling all the world, to save enormous amounts of measles where miracles are in the form of Devi Sri vijayadurga.
                                                  Invoking goddess: Dhwajarohanam being performed by Sri Vijaya Durga Devi Temple founder S. Mallikarjuna Rao during the beginning of Brahmotsavam in Kadapa on Thursday.
Dhwajarohanam being performed by Sri Vijaya Durga Devi Temple founder S. Mallikarjuna Rao during the beginning of Brahmotsavam in Kadapa 


Watch Sri Vijaya Durga Devi Temple History Video

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!