త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 17 తేదీ నుంచి ప్రిలిమ్స్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంటుంది.