ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాలు కేవలం ఒక్క సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18 మే 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోర్టు నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేరినారు మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం ఒక ఉద్యోగం మాత్రమే ఖాళీగా ఉంది ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదివేల రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు విద్యార్హతల విషయానికి వస్తే కోర్టు అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసయి ఉండాలి 31 మే 2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది .
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని దానిని ఫిలప్ చేసి సంబంధిత అర్హత పత్రాలను జతపరచి వాటిని 18 మే 2024 లోపు ఆఫీస్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి తూర్పుగోదావరి జిల్లా అనే చిరునామాలు అందజేయాలి.
వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
వాట్సాప్ గ్రూప్ | టెలిగ్రామ్ గ్రూప్ |
Leave a Comment