వైఎస్ఆర్ జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ వారి సౌజన్యంతో కడప ఐటీఐ సర్కిల్లోని ప్రభుత్వ డీఎల్సీ కార్యాలయంలో ఫిబ్రవరి 3న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం అధికారిణి దీప్తి తెలిపారు. 16 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని అర్హత గల అభ్యర్థులు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు.